15 లక్షలు ఇస్తే ఇన్స్పెక్టర్లుగా చేస్తామంటూ..

Gang used to take contract to make inspector for 15 lakhs. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని చెబుతూ మోసం చేసే బ్యాచ్ ల గురించి మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం..! కొందరు మాయ మాటలు చెప్పి

By అంజి  Published on  25 Nov 2021 10:20 AM GMT
15 లక్షలు ఇస్తే ఇన్స్పెక్టర్లుగా చేస్తామంటూ..

నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని చెబుతూ మోసం చేసే బ్యాచ్ ల గురించి మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం..! కొందరు మాయ మాటలు చెప్పి ఉద్యోగాల పేరుతో భారీ మోసాలను చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ బ్యాచ్ గుట్టును రట్టు చేశారు. 15 లక్షలకు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఉద్యోగాలు ఇస్తామంటూ చెబుతున్న ముఠాలోని ముగ్గురిని గోరఖ్‌పూర్‌ ఎస్‌టీఎఫ్‌ విభాగం మంగళవారం నాడు ప్లానిటోరియం ప్రాంతంలో అరెస్టు చేసింది. సెంటర్ నిర్వాహకులు ఇంకొందరితో కుమ్మక్కై ముఠా పెద్ద ఎత్తున అభ్యర్థులను ఇన్‌స్పెక్టర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చూసుకుంది. గోరఖ్‌పూర్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ సివిల్ పోలీస్ మరియు ఇతర పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ పరీక్ష-2021లో పెద్ద ఎత్తున మోసం జరగబోతోందని STFకి సమాచారం అందింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

అశ్వనీ దూబే, అనుభవ్ సింగ్ క్లస్టర్ హెడ్ ఎన్‌ఎస్‌ఈఐటీ గోరఖ్‌పూర్, ఆశిష్ శుక్లా సెంటర్ డైరెక్టర్ కావలీర్ యానిమేషన్ సెంటర్ ఎన్‌ఎస్‌ఈఐటీ గోరఖ్‌పూర్, దీపక్, దివాకర్ అలియాస్ రింటు, సేనాపతి సెంటర్ డైరెక్టర్, సిద్ధి వినాయక్ ఆన్‌లైన్ సెంటర్ గోరఖ్‌పూర్, నిత్యానంద్ గౌర్, సంతోష్ యాదవ్, రజనీష్ దీక్షిత్ తదితరులు కలిసి కాపీకి ఏర్పాట్లు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అధికారులు గుర్తించారు. డియోరియా బైపాస్ టర్న్‌లో పరీక్షలో ఉత్తీర్ణత పేరుతో కొందరు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సత్య ప్రకాశ్ సింగ్ నేతృత్వంలోని బృందం పలు ప్రాంతాల్లో సోదాలు చేయడమే కాకుండా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story