దేశంలో సుదూర రైలు ప్రయాణ విభాగాల్లో ఒక ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తూ రాబోయే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ కోసం ఛార్జీలు, రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ను భారత రైల్వే అధికారికంగా రూపొందించింది. చిన్న, మధ్యస్థ మార్గాల్లో సుపరిచితమైన చైర్-కార్ వందే భారత్ సేవల మాదిరిగా కాకుండా, ఈ కొత్త స్లీపర్ వేరియంట్ వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించబడింది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో వీఐపీలకు ప్రత్యేక కోటా ఏం లేదు. రైల్వే ఉన్నతాధికారులు కూడా టికెట్లు తీసుకుని సాధారణ ప్రయాణికులతో పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే వందే భారత్ స్లీపర్ సేవలు అందుబాటులో ఉంచేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రైళ్లల్లో మొత్తం 11 కోచ్లు అందుబాటులో ఉంటాయి. ఐదు థర్డ్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటుంది. మొత్తం 823 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీలో 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్లు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలులో AC 3-టైర్ బేస్ ఛార్జీలు కిలోమీటరుకు 2.4 రూపాయలుగా నిర్ణయించారు. AC 2-టైర్ కిలోమీటరుకు రూ. 3.1, AC ఫస్ట్ క్లాస్ కిలోమీటరుకు రూ.3.8 గా ఉంది.
ప్రాథమిక ఛార్జీలు:
AC 3-టైర్: కి.మీ.కు రూ. 2.4
AC 2-టైర్: కి.మీ.కు రూ. 3.1
AC ఫస్ట్ క్లాస్: కి.మీ.కు రూ. 3.8
కనీస ఛార్జీలు (400 కి.మీ. వరకు):
AC 3-టైర్: రూ. 960
AC 2-టైర్: రూ. 1,240
AC ఫస్ట్ క్లాస్: రూ. 1,520