ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో మద్యం తాగి మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి

Drunk Man Urinates On Woman In New York-Delhi Air India Flight. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో మద్యం తాగి ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిని

By M.S.R  Published on  4 Jan 2023 6:11 AM GMT
ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో మద్యం తాగి మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి

ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో మద్యం తాగి ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చినట్లు ఎయిర్‌లైన్ ఈరోజు తెలిపింది. నవంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 26న, న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణికుడు తన 70 ఏళ్ల ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం అనంతరం లైట్లు ఆర్పే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహిళ తన బట్టలు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసిపోయాయని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి తిరిగి తన సీటు లోకి రావాలని చెప్పారని ఆరోపించారు. ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో ఎయిర్‌లైన్ చర్యలు తీసుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. "ఎయిర్ ఇండియా ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అతడిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని సిఫార్సు చేసింది. ఈ విషయం ప్రభుత్వ కమిటీ క్రింద ఉంది. నిర్ణయం కోసం వేచి ఉన్నాం" అని ఒక అధికారి తెలిపారు.

చాలా బిజినెస్ క్లాస్ సీట్లు ఖాళీగా ఉన్నా తనకు మరో క్యాబిన్ సీటు ఇవ్వలేదని మహిళ ఆరోపిస్తోంది. విమానం ఢిల్లీలో దిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ప్రయాణికుడిని బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఎయిర్‌లైన్ నుండి నివేదికను కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story