దారుణం.. ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌పై మూత్రం పోసిన ఇంజినీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రుడు

ఓ యువ‌కుడు మ‌ద్యం మ‌త్తులో బ‌స్సులో కూర్చోని ఉన్న మ‌హిళా ప్ర‌యాణికురాలిపై మూత్రం పోశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2023 4:18 AM GMT
KSRTC bus incident, Drunk man pees on female co-passenger,

ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌పై మూత్రం పోసిన ఇంజినీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రుడు

మ‌ద్యం మ‌త్తులో కొంద‌రు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విమానంలో ఓ ప్ర‌యాణికురాలిపై తోటి ప్ర‌యాణికుడు మూత్ర విస‌ర్జ‌న చేసిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే అలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సులోనూ చోటు చేసుకుంది. బ‌స్సులో నిద్రిస్తున్న మ‌హిళ‌పై ఓ ఇంజినీరింగ్ పాసైన యువ‌కుడు మూత్రం పోశాడు. ఈ ఘ‌ట‌న హుబ్బళ్లి సమీపంలోని చోటు చేసుకుంది.

క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బ‌స్సు విజ‌య‌పుర నుంచి మంగళూరుకు బ‌య‌లు దేరింది. మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో భోజ‌నం చేసేందుకు ఓ దాబా ఆగింది. కొంద‌రు ప్ర‌యాణీకులు బ‌స్సు దిగి టీ తాగేందుకు వెళ్లారు. ముందు వ‌రుస‌లో కూర్చొన్న ఓ మ‌హిళ గాఢ నిద్ర‌లో ఉంది. బ‌స్సు వెనుక వ‌రుస‌లో 28వ సీటులో రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు కూర్చోని ఉన్నాడు. ఇంజినీరింగ్ చ‌దువుకున్న అత‌డు మ‌ద్యం సేవించి ఉన్న‌ట్లుగా చెప్పారు.

త‌న సీటులోంచి లేచి వ‌చ్చిన రామ‌ప్ప‌.. మ‌హిళ స‌మీపంలోకి వ‌చ్చి ఆమెపై మూత్రం పోశాడు. దీంతో గాఢ‌నిద్ర‌లో ఉన్న ఆమె వెంట‌నే లేచింది. జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ను చూసి భ‌య‌బ్రాంతుల‌కు గురైంది. గ‌ట్టిగా కేక‌లు వేసింది. వెంట‌నే బ‌స్సులోని మిగ‌తా ప్ర‌యాణీకులు, డాబా వ‌ద్ద జ‌నాలు బ‌స్సులోప‌లికి వ‌చ్చి అత‌డిని ప‌ట్టుకున్నారు.

అత‌డిని బ‌స్సు నుంచి కింద‌కు దించేశారు. అత‌డి సామాగ్రిని బ‌య‌ట‌ప‌డేశారు. కొంద‌రు ప్ర‌యాణీకులు అత‌డిపై చేయి కూడా చేసుకున్నారు. బాధిత మ‌హిళ దాబాలోని స్నానాల గ‌దిలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని వ‌చ్చే వ‌ర‌కు బ‌స్సును ఆపారు. మ‌హిళ వ‌ద్దు అని చెప్ప‌డంతోనే ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని కండ‌క్ట‌ర్ చెప్పారు.

Next Story