Video : పర్సు దొంగ లాక్కెళ్లాడట.. ఏసీ కోచ్ కిటికీని పగులగొట్టింది

రైలు ప్రయాణంలో తన పర్సును దొంగిలించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోపంతో ఒక మహిళ తన ఏసీ కోచ్ కిటికీని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By -  Medi Samrat
Published on : 30 Oct 2025 3:32 PM IST

Video : పర్సు దొంగ లాక్కెళ్లాడట.. ఏసీ కోచ్ కిటికీని పగులగొట్టింది

రైలు ప్రయాణంలో తన పర్సును దొంగిలించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోపంతో ఒక మహిళ తన ఏసీ కోచ్ కిటికీని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తోటి ప్రయాణీకులు ఆపమని అడిగినా కూడా పట్టించుకోకుండా, ఆ మహిళ పదే పదే తన కంపార్ట్‌మెంట్ కిటికీ అద్దాన్ని పగలగొట్టడం చూడొచ్చు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తుండగా కోచ్ అంతటా గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె పక్కనే ఒక పసిబిడ్డ కూర్చుని ఉంది.

ప్రయాణిస్తున్నప్పుడు ఆ మహిళ పర్సు దొంగిలించబడిందని నివేదికలు సూచిస్తున్నాయి. రైల్వే సిబ్బంది, అధికారుల సహాయం లేకపోవడంతో ఆమె రైలు కిటికీపై తన కోపాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.

Next Story