కోవిడ్‌-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక

దేశంలో కోవిడ్‌-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 3 Jun 2025 10:51 AM IST

National News, India, Covid-19,

కోవిడ్‌-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక

దేశంలో కోవిడ్‌-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు. తక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నప్పటికీ అసత్య సమాచారం, అపోహలే ప్రస్తుతం సమాజానికి నిజమైన ప్రమాదమని హెచ్చరిస్తున్నారు

ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

2023 చివరినుండి దేశంలోని wastewater పరీక్షల్లో కొవిడ్ వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రోజుకు 0 నుంచి 50 కేసుల వరకే నమోదవుతున్నాయి. ఇది అప్రమత్తత అవసరమన్నది తప్ప భయపడాల్సిన పరిస్థితి కాదని నిపుణులు పేర్కొన్నారు.

వైరస్ మాయం కాదు – సహజ ప్రక్రియ

కొత్త వైరస్‌లు జనాభాలో కొన్ని సంవత్సరాలపాటు తక్కువస్థాయిలో తిరుగుతూనే ఉంటాయి. ఇది సహజమైన వైరస్ ప్రవర్తన . ‘‘ఫ్లూ, ఆర్‌ఎస్‌వి లాంటి వైరస్‌లా, కోవిడ్ వైరస్ కూడా కొన్ని సంవత్సరాలు చక్కర్లు కొడుతుంది. ఇది కొత్త విషయం కాదు.

కేసుల పెరుగుదల వెనుక కారణాలేమిటి?

కేసుల పెరుగుదల వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి

పాత వేరియంట్లే తిరిగి యాక్టివ్ కావడం (ఉదా: JN.1, KP.2).

రెండోసారి వైరస్ సోకినా, తీవ్రమైన లక్షణాలు లేకపోవడం.

పరీక్షలు, మానిటరింగ్ పెరిగినద్వారా కేసులు కనిపించడమంటేనే.

ఇమ్యూనిటీ పెరిగింది – టీకాలు తీసుకున్న వారెక్కువ

దేశ జనాభాలో చాలా మందికి ఇప్పటికే టీకాలు వేసారు. కొందరికి సహజంగా వైరస్ వచ్చినట్లయితే, వాళ్లకు “హైబ్రిడ్ ఇమ్యూనిటీ” ఏర్పడింది . ఇది వారి రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుతుంది . ఈ నేపథ్యంలో ప్రజలందరికీ మళ్లీ కోవిడ్ టీకాలు అవసరం లేదని చెప్పారు.

కోవిడ్ కన్నా ఇతర వ్యాధులే ప్రమాదకరం

ప్రతి రోజూ దాదాపు 8,000 మంది క్షయవ్యాధి (టిబి)తో చనిపోతున్నారు. అలాగే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ఇన్‌ఫ్లూయెంజా వంటివి మరిన్ని ప్రాణాలను బలిగొడుతున్నాయి. అయినా, ప్రజల దృష్టి మళ్లీ కోవిడ్‌పైనే ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

అసత్య ప్రచారమే నిజమైన వైరస్

కేసుల సంఖ్య కన్నా వైరస్ గురించి వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారాలే ప్రస్తుతం ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. భయంతో పరీక్షలు చేయించుకోవడం, హాస్పిటల్ వెళ్లడం వంటి చర్యలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ‘‘మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే – కోవిడ్‌ను ఇప్పుడు శాస్త్రీయమైన, సమతుల్య దృక్పథంతో చూడాలి,’’ అని సూచించారు.

Next Story