ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు : మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన‌ ఢిల్లీ హైకోర్టు

Delhi HC dismisses Manish Sisodia's bail plea. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈడీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను

By Medi Samrat  Published on  3 July 2023 10:28 AM GMT
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు : మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన‌ ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈడీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. బెయిల్‌ను తిరస్కరించాలన్న రూస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని మనీష్ సిసోడియా సవాలు చేశారు. బెయిల్ మంజూరుకు ట్రిపుల్ టెస్ట్‌తో పాటు.. మనీలాండరింగ్ కింద బెయిల్ మంజూరుకు సంబంధించిన జంట షరతులను సంతృప్తి పరచడంలో సిసోడియా విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.

విజయ్ నాయర్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, అతను సిసోడియాతో సన్నిహితంగా ఉన్నాడని కోర్టు పేర్కొంది. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని కోర్టు పేర్కొంది. దీంతో పాటు సహ నిందితులు అభిషేక్ బోయినపల్లి, బినయ్ బాబుల బెయిల్ పిటిషన్‌లను కూడా కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది, అప్పటి నుండి ఆయ‌న తీహార్ జైలులో ఉన్నారు.


Next Story