భారత్ జోడో యాత్ర లోగో, ట్యాగ్లైన్ రిలీజ్
Congress released Bharat Jodo Yatra logo and tagline. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
By అంజి
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా యాత్ర నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 'భారత్ జోడో యాత్ర'కు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్లైన్, కరపత్రం, వెబ్సైట్ను రిలీజ్ చేసింది. పలు భాషల్లో 'భారత్ జోడో యాత్ర' లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జైరాం రమేష్, దిగ్విజయ్సింగ్, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులంతా సమావేశం అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి 'భారత్ జోడో యాత్ర' చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో.. దాదాపు 5 నెలల పాటు ఈ యాత్ర జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. 148 రోజుల పాదయాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది. కాగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు పార్టీ నాయకులు పాదయాత్రలు, ర్యాలీలు సహా పలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాజయం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి సంకల్పంతో ఉంది. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతోంది. గాంధీ తన భారత్ జోడో యాత్రకు ముందు సమాజంలోని వివిధ వర్గాల కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులను కలవనున్నారు. ప్రచారానికి వారం రోజులు మాత్రమే ఉన్నందున, ఎంపీ రాహుల్ గాంధీ 'ఐక్యతా కార్యాచరణ'కు పిలుపునిచ్చారు.
కాగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన కార్యక్రమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. యాత్ర కోసం రూపొందించిన వెబ్సైట్ గురించి దిగ్విజయ్సింగ్ మాట్లాడుతూ.. యాత్ర ప్రచారం కోసం ప్రజలు తమను తాము ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే వెబ్సైట్ అన్ని ఈవెంట్లను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు.
Delhi | Congress releases logo, tagline, and pamphlet of their 'Bharat Jodo Yatra' which will begin on 7th September
— ANI (@ANI) August 23, 2022
"We've also launched a website," says party leader Jairam Ramesh pic.twitter.com/KMOBI6W5KY