ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో, పెద్ద అక్షరాలతో పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
బీహార్ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By - Medi Samrat |
బీహార్ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమవుతుంది. ఓటర్ల సౌకర్యార్థం, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈవీఎం బ్యాలెట్ పేపర్కు సంబంధించిన నిబంధనలను ఈసీ మార్పులు చేసిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమాలు, 1961లోని రూల్ 49B ప్రకారం ఈ మార్పులు చేయబడ్డాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక నుంచి ఈవీఎంల ఫొటోలో నాలుగింట మూడు వంతులు అభ్యర్థి ముఖం ఆక్రమిస్తుందని, దీంతో ఓటర్లకు అభ్యర్థిని గుర్తించడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
"భారత ఎన్నికల సంఘం (ECI) EVM బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ కోసం, వాటి స్పష్టత, రీడబిలిటీని మెరుగుపరచడానికి ఎన్నికల నియమావళి, 1961 యొక్క నియమం 49B కింద ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను సవరించింది" అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, మెరుగుపరచడానికి, ఓటరు సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎన్నికల సంఘం గత 6 నెలల్లో చేపట్టిన 28 కార్యక్రమాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటన పేర్కొంది. నోటాతో సహా అభ్యర్థులందరి పేర్లు ఒకే ఫాంట్లో, సులభంగా చదవగలిగేంత పెద్ద ఫాంట్లో ముద్రించబడతాయని ఎన్నికల సంఘం తెలిపింది.