కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. కన్నడ భాష దీర్ఘకాల చరిత్ర గురించి ఆయనకు తెలియదు..అని సిద్ధరామయ్య అన్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ తమిళం నుండి ఉద్భవించిందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ.. "కన్నడకు చాలా కాలంగా చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్, అతనికి దాని గురించి తెలియదు" అని అన్నారు.
కాగా కమల్ హాసన్ ప్రకటన రాజకీయ పరంగా తీవ్ర స్పందనలను రేకెత్తించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కమల్ హాసన్పై మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నారు. బీజేపీ నాయకుడు ఆర్ అశోక కమల్హాసన్ను “మానసిక రోగి” అని విమర్శించారు. మరికొందరు అతని వ్యాఖ్యలు వాస్తవంగా తప్పు అని కన్నడ భాష యొక్క సాంస్కృతిక గుర్తింపును అవమానించాయని విమర్శించారు. కన్నడ, కర్ణాటకలను కమల్ హాసన్ పదే పదే అగౌరవపరుస్తున్నారని ఆరోపిస్తూ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మరింత ముందుకు వెళ్ళాడు. "కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలన్నింటినీ బహిష్కరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, లేకుంటే ఆయన మానసిక రోగిలా ప్రవర్తిస్తూనే ఉంటారు" అని అశోక అన్నారు.