సీఎం ప్రెస్మీట్లో పాము కలకలం
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రెస్మీట్లో పాము కలకలం రేపింది.
By Medi Samrat
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రెస్మీట్లో పాము కలకలం రేపింది. బిలాస్పూర్లో మీడియా ప్రతినిధులతో సీఎం మాట్లాడుతుండగా.. ఆయన కాళ్ల కిందకు పాము వచ్చింది. పాము రావడంతో జనంలో కలకలం రేగింది. సీఎం భూపేష్ బఘేల్.. పామును చంపవద్దని ప్రజలకు సూచించారు. చిన్నతనంలో పామును జేబులో పెట్టుకుని వెళ్లేవాళ్లమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
मुख्यमंत्री श्री @bhupeshbaghel
— Manjeet Singh Ghoshi (@ghoshi_manjeet) August 21, 2023
जी के पैर के पास पहुंच गया साँप,
भूपेश बघेल जी बोले मत मारना पिरपीटी साँप हे और सावन भी चल रहा हैं ,जब मैं बच्चा था तो इस साँप को पॉकेट में लेकर घूमता था, 🔥🔥
यही अंतर है सच्चे हिन्दू और नकली हिंदू में#Chhattisgarh #NagPanchami2023 pic.twitter.com/IKg8a8JAZa
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో మాజీ, దివంగత ప్రధాని రాజీవ్గాంధీ పేరిట అనేక పథకాలు అమలవుతున్నాయని.. ఈ పథకాలతో కలిపి రూ. 2055 కోట్లకు పైగా నిధులు అందజేశామని అన్నారు. ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని సీఎం బఘేల్ అన్నారు. మధ్యలో మనిషి లేడు. కమీషన్ లేదు. ఇప్పటి వరకు దాదాపు లక్షా 60 వేల కోట్ల లబ్ది జరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రభుత్వం.. కార్మికులు, రైతులు, యువత అందరి పక్షాన ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.