ఘోర ప్రమాదం..200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik
ఘోర ప్రమాదం..200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. 30 మంది ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. మండి జిల్లా ప్రతీఘాట్ వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు పలువురు ప్రయాణికులతో జహు నుంచి మండి వెళ్తోంది. ఈ క్రమంలో ప్రతీఘాట్ వద్దకు రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
#WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi. (Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi
— ANI (@ANI) June 17, 2025