నిఫా వైరస్‌ సోకిన బాలుడు మృతి

కేరళలో నిఫా వైరస్ మరో ప్రాణం తీసింది. మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు

By Medi Samrat  Published on  21 July 2024 9:10 AM GMT
నిఫా వైరస్‌ సోకిన బాలుడు మృతి

కేరళలో నిఫా వైరస్ మరో ప్రాణం తీసింది. మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడితో పరిచయం ఉన్న వ్యక్తులను రక్షించడానికి కేర‌ళ‌ మోనోక్లోనల్ యాంటీబాడీలను ఆర్డర్ చేసింది.

నిఫా వైరస్ సోకి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. సెప్టెంబర్ 2023 తర్వాత కేరళలో ఈ ఇన్ఫెక్షన్ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మే 12న బాలుడు వైద్యం కోసం ఓ ప్రైవేట్ క్లినిక్‌కి వెళ్లినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మే 15న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అనంతరం పెరింతల్‌మన్నలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కూడా కోలుకోకపోవడంతో చిన్నారిని కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

బాలుడు మృతి చెందడంతో కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించబడింది. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. చివరిసారిగా ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీలను కొనుగోలు చేశామని.. వాటిని పూణె ఎన్‌ఐవిలో ఉంచామని.. అవి నేడు కేరళకు చేరుకుంటాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ మంజేరి మెడికల్ కాలేజీలో 30 ఐసోలేషన్ వార్డులు.. మలప్పురంలో కాల్ సెంటర్, కంట్రోల్ రూం ప్రారంభించామ‌న్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పూణె ఎన్‌ఐవీ గతసారి మాదిరిగానే మొబైల్ ల్యాబ్‌ను అందించాలని కోరినట్లు మంత్రి తెలిపారు.

Claim Review:Boy Who Was Undergoing Treatment For Nipah Infection In Kerala Dead
Claim Fact Check:False
Next Story