Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిరిండియా విమానంలోని సిబ్బందికి బెదిరింపు లేఖ వచ్చింది.
By Medi Samrat
ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిరిండియా విమానంలోని సిబ్బందికి బెదిరింపు లేఖ వచ్చింది. విమానంలో బాంబు ఉందని బెదిరింపు లేఖలో రాసి ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 2948 కాగా.. బెదిరింపులు రాగానే ఫ్లైట్ను హడావుడిగా తనిఖీ చేశారు. అయితే విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందన్న విషయం తెలిసి విమానాశ్రయ అధికారులు షాక్కు గురయ్యారు. వెంటనే విచారణ ప్రారంభించారు. విమానంలోని ప్రతి మూల, మూలల్లో బాంబు సోదాలు జరిగాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
గత కొన్ని వారాలుగా ఎయిర్ ఇండియా విమానాలలో అనేక సాంకేతిక, కార్యాచరణ సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఇండియా విమానాల భద్రత, విశ్వసనీయతపై ఆందోళనలు పెరిగాయి. దీంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి.
ఇదిలావుంటే.. కొద్దిరోజుల క్రితం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఫ్లైట్ (AI-171) విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. అలాగే మెడికల్ కాలేజీకి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.