దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఈరోజు (శుక్రవారం) కూడా మళ్లీ దాదాపు 20 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. పశ్చిమ్ విహార్ ప్రాంతంలో ఉన్న రిచ్మండ్ గ్లోబల్ స్కూల్కు బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో రోహిణి సెక్టార్-3లో ఉన్న అభినవ్ పబ్లిక్ స్కూల్కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపుతో అన్ని పాఠశాలల్లో భయానక వాతావరణం నెలకొంది.
పాఠశాలల్లో బాంబుల గురించి గుర్తుతెలియని వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడని చెబుతున్నారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక శాఖకు చెందిన ఒక్కో వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు రోహిణి సెక్టార్-3లోని అభినవ్ పబ్లిక్ స్కూల్లో బాంబు గురించి సమాచారం అందిందని, రోహిణి సెక్టార్-24లోని సవర్న్ స్కూల్ గురించి ఉదయం 8:16 గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో సోదాలు కొనసాగుతున్నాయి.