బెంగళూరు తొక్కిసలాట కేసులో కీల‌క ప‌రిణామం.. RCB నుంచి తొలి అరెస్ట్‌

చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

By Medi Samrat
Published on : 6 Jun 2025 10:21 AM IST

బెంగళూరు తొక్కిసలాట కేసులో కీల‌క ప‌రిణామం.. RCB నుంచి తొలి అరెస్ట్‌

చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో దోషపూరిత హత్య వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కర్ణాటక సీఎం అరెస్ట్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే తొలి అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కబ్బన్ పోలీస్ స్టేషన్‌లో వారందరినీ క్షుణ్ణంగా విచారిస్తున్నారు.

ఆర్‌సిబి తొలిసారి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సంబరాల్లో పాల్గొనేందుకు బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల లక్షలాది మంది అభిమానులు గుమిగూడారు. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, 56 మంది గాయపడ్డారు. కేసు విచారణ నిమిత్తం సీఐడీకి అప్పగించారు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆర్‌సిబిని నిందితుడు నంబర్ 1గా, డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిందితుడి నంబర్ 2గా, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీని నిందితుడి నంబర్ 3గా చేర్చారు.

ఈవెంట్ నిర్వహించడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అవసరమైన అనుమతి లేకుండానే ఆర్‌సీబీ, డీఎన్‌ఏ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ, రాష్ట్ర క్రికెట్‌ సంఘం విజయోత్సవాన్ని జరుపుకున్నాయి. దీనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ తర్వాత చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని ఆర్‌సీబీ తెలిపింది.

Next Story