చెన్నైలో భారీ వర్షం.. 4 కి.మీలు అంబులెన్స్‌కు దారి ఏర్పాటు చేసిన బ్యాంక్ మేనేజర్

Bank manager makes way for ambulances amid heavy rain in Chennai. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది.

By అంజి  Published on  2 Jan 2022 9:44 AM GMT
చెన్నైలో భారీ వర్షం.. 4 కి.మీలు అంబులెన్స్‌కు దారి ఏర్పాటు చేసిన బ్యాంక్ మేనేజర్

తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. వాటర్‌లాగింగ్ కారణంగా వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలు ప్రజలు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నట్లు చూపించాయి. అటువంటి గ్రిడ్‌లాక్‌లో మూడు అంబులెన్స్‌లు అన్నాసాలైలో చిక్కుకున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకుని అంబులెన్స్‌లు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాయి.

కానీ డ్రైవర్లు ట్రాఫిక్ నుండి బయటపడటానికి మార్గం కనుగొనలేకపోయారు. ఈ సమయంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ అయిన జిన్నా, బాధాకరమైన పరిస్థితిని గమనించి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కకు పార్క్ చేసి.. జిన్నా దాదాపు నాలుగు కిలోమీటర్లు వర్షంలో తడుస్తూ అంబులెన్స్‌లకు దారి తీశాడు. అంబులెన్స్‌లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో అతని దృఢసంకల్పంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా బ్యాంకు మేనేజర్‌ జిన్నాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story