మోదీ అంటే కాంగ్రెస్‌కు ఎంత విద్వేషమో: అమిత్‌ షా

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

By అంజి  Published on  30 Sep 2024 6:10 AM GMT
Amit Shah , Kharge, PM Modi, National news

మోదీ అంటే కాంగ్రెస్‌కు ఎంత విద్వేషమో: అమిత్‌ షా

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆ వ్యాఖ్యలు “పూర్తిగా అసహ్యకరమైనవని, అవమానకరమైనవని” అని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు "ద్వేషం యొక్క చేదు ప్రదర్శన" అని అమిత్‌ షా అన్నారు. మోడీని అధికారం నుండి తొలగించిన తర్వాతనే తాను చనిపోతానని చెప్పడం ద్వారా ఖర్గే అనవసరంగా ప్రధానిని తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి లాగారని అన్నారు. మోదీ అంటే కాంగ్రెస్‌ నాయకులకు ఎంత విద్వేషం ఉందో మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగాన్ని బట్టి తెలుస్తోందన్నారు.

ఆదివారం జమ్మూలోని జస్రోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు, అయితే కొద్దిసేపు విరామం తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు, ప్రధాని మోడీని అధికారం నుండి తొలగించే వరకు తాను చనిపోనని చెప్పారు. ''నా వయసు 83 సంవత్సరాలు. నేను అంత తొందరగా చనిపోను. ప్రధాని మోదీని అధికారం నుంచి తప్పించే వరకు నేను బతికే ఉంటాను'' అని కాంగ్రెస్ నేత అన్నారు. ''నేను మాట్లాడాలనుకున్నాను. కానీ తల తిరగడం వల్ల కూర్చున్నాను. దయచేసి నన్ను క్షమించండి'' అని అన్నారు.

ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా మండిపడ్డారు. ''నిన్న, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జీ తన ప్రసంగంలో పూర్తిగా అసహ్యంగా, అవమానకరంగా ఉండటంలో తనను, తన నాయకులను మరియు తన పార్టీని మించిపోయారు'' అని అమిత్‌ షా అన్నారు. "ద్వేషపూరిత ప్రసంగంలో అతను పీఎం మోడీని అధికారం నుండి తొలగించిన తర్వాత మాత్రమే చనిపోతానని చెప్పి అనవసరంగా తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి పీఎం మోదీని లాగారు" అని షా ఎక్స్‌లో రాశారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ప్రజలకు ఎంత ద్వేషం, భయం ఉందో ఖర్గే వ్యాఖ్యలతో అర్థమవుతోందని, వారు నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తున్నారని అన్నారు.

“మిస్టర్ ఖర్గే జీ ఆరోగ్యం విషయానికొస్తే.. మోదీ జీ, నేను ప్రార్థిస్తున్నాను. ఆయన దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని మనమందరం ప్రార్థిద్దాం. అతను చాలా సంవత్సరాలు జీవించి, 2047 నాటికి విక్షిత్ భారత్‌ను సృష్టించేలా జీవించాలని కోరుకుంటున్నాను” అని అమిత్‌ షా అన్నారు.

Next Story