అమిత్ షాపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై వివాదాస్పద ప్రకటన చేశారు.
By - Medi Samrat |
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై వివాదాస్పద ప్రకటన చేశారు. అదే సమయంలో హోం మంత్రి అమిత్ షాపై కూడా ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను రహస్యంగా కలుస్తున్నారని పవన్ ఖేరా అన్నారు. హోంమంత్రి పాట్నాకు వచ్చినప్పుడల్లా హోటల్ లిఫ్ట్లలో అమర్చిన సీసీ కెమెరాలకు పేపర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. హోంమంత్రి అధికారులతో రహస్యంగా సమావేశమవుతున్నారు. భద్రత విషయంలో రాజీ పడుతున్నారు. అమిత్ షా రహస్యంగా ఏయే సమావేశాలు నిర్వహిస్తున్నారని పవన్ ఖేరా ప్రశ్నించారు.
నవంబర్ 6న జరిగిన బీహార్ తొలిదశ ఎన్నికల్లో 121 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి 72 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. ఈసారి మహాకూటమి స్ట్రైక్ రేట్ మరింత మెరుగ్గా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ కొన్ని ర్యాలీలను కుదించారని విన్నాను. ప్రధాని నరేంద్ర మోదీ కట్టా ప్రకటనకు కౌంటర్ ఇస్తూ.. నితీష్ కుమార్ ప్రధాని నుదిటిపై కట్టా వేసి తానే సీఎంగా ప్రకటించుకోవాలని అన్నారు. పవన్ ఖేరా ప్రకటనతో బీహార్లో రాజకీయ దుమారం చెలరేగింది. బీహార్ తొలి దశ ఎన్నికల్లో తరతరాలుగా ఓటు వేస్తున్న వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని గతంలో పవన్ ఖేరా ఆరోపించారు.