అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అక్కడికి బయల్దేరారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కేంద్రమంత్రి సంప్రదింపులు జరుపుతున్నారు. అహ్మదాబాద్ దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని రామ్మోహన్నాయుడు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందుకు తాను తక్షణమే అహ్మదాబాద్కు బయలుదేరుతున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి, ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.