హైదరాబాద్ నుండి థాయిలాండ్లోని ఫుకెట్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం నోస్ వీల్లో సమస్య కారణంగా ఫుకెట్ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ అయిందని ఎయిర్లైన్ బుధవారం తెలిపింది. ఈ సంఘటన తర్వాత ఫుకెట్ విమానాశ్రయ అధికారులు విమానం రన్వేపై ఇరుక్కుపోవడంతో విమాన కార్యకలాపాలను నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి. బోయింగ్ 737-మాక్స్8 విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వెంటనే తెలియరాలేదు.
"మార్చి 11న మా హైదరాబాద్-ఫుకెట్ విమానంలో ఫుకెట్ విమానాశ్రయంలో నోస్ వీల్లో సమస్య తలెత్తిందని మేము ధృవీకరిస్తున్నాము" అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండింగ్ గేర్ వ్యవస్థలో నోస్ వీల్ ఒక ముఖ్యమైన భాగం.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ flightradar24.com ప్రకారం.. విమానం IX 938 హైదరాబాద్ నుండి ఉదయం 6.20 గంటలకు కాకుండా ఉదయం 6.42 గంటలకు బయలుదేరి, స్థానిక సమయం ప్రకారం ఉదయం 11.40 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. "సిబ్బంది అన్ని ప్రామాణిక ప్రోటోకాల్లను పాటించారు. ప్రయాణికులను విమానం నుండి దింపారు" అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.