జూన్ 24న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలను సేకరించడంలో కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR)లను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యాక్సెస్ చేసింది. సంబంధిత డేటాను డౌన్లోడ్ చేసుకుని, విశ్లేషించడం ప్రారంభించిందని ప్రభుత్వం తెలిపింది.
ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడం, విమానయాన భద్రతను మెరుగుపరచడానికి ఈ డేటా చాలా కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి దోహదపడే అంశాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మెమరీ మాడ్యూల్ విజయవంతంగా యాక్సెస్ చేశారని, దాని డేటాను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన క్రాష్ ఇన్వెస్టిగేషన్ విభాగం కింద ఉన్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రయోగశాలలో డౌన్లోడ్ చేశారు.