ఇప్పుడు పాస్‌పోర్ట్‌ రీన్యువల్‌ కేవలం 20 నిమిషాల్లో!

భారత పాస్‌పోర్ట్‌ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 2 Nov 2025 9:40 AM IST

National News, Delhi, Indian passport services

ఇప్పుడు పాస్‌పోర్ట్‌ రీన్యువల్‌ కేవలం 20 నిమిషాల్లో!

ఢిల్లీ: భారత పాస్‌పోర్ట్‌ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇకపై పాస్‌పోర్ట్‌ రీన్యువల్‌ (పునరుద్ధరణ) కోసం రోజంతా వేచి చూడాల్సిన అవసరం లేదు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించిన కొత్త సౌకర్యం ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే పాస్‌పోర్ట్‌ రీన్యువల్‌ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను “ఇన్‌స్టంట్ పాస్‌పోర్ట్ రీన్యువల్ సిస్టమ్” పేరుతో ప్రారంభించారు. ఇది ప్రస్తుతం కొన్ని మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైందని, త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

ప్రధాన అంశాలు: పాత పాస్‌పోర్ట్‌ గడువు ముగియడానికి 1 సంవత్సరం మిగిలి ఉన్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్‌ ధృవీకరణ అనంతరం 20 నిమిషాల్లో పాస్‌పోర్ట్‌ రీన్యువల్‌ అవుతుంది. కొత్త పాస్‌పోర్ట్‌ కూరియర్‌ ద్వారా 48 గంటల్లో అందుతుంది.

విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త సిస్టమ్‌తో ప్రతి రోజు వేల సంఖ్యలో దరఖాస్తులను వేగంగా పరిష్కరించగలమని అంచనా. పౌరులకు సమయాన్ని, ఖర్చును ఆదా చేసే విధంగా ఈ ఆధునిక వ్యవస్థ రూపుదిద్దుకున్నదని అధికారులు పేర్కొన్నారు. భారత పాస్‌పోర్ట్‌ సర్వీసులు ఇప్పుడు మరింత సులభం, వేగం మరియు పారదర్శకంగా మారాయి.

Next Story