కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik
కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా గుప్తకాశీ సమీపంలోని గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక గౌరీకుండ్ అడవుల్లో క్రాష్ అయింది. మరో వ్యక్తితో పాటు ఫైలట్ ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
కాగా ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పందించారు."రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి చాలా విచారకరమైన వార్తలు అందాయి. SDRF, స్థానిక పరిపాలన మరియు ఇతర రెస్క్యూ బృందాలు సహాయ మరియు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి."అని పేర్కొన్నారు.
మరో వైపు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారిని అధికారులు గుర్తించారు. అందులో ప్రయాణిస్తోన్న వారిలో రాజ్వీర్-పైలట్, విక్రమ్ రావత్, వినోద్, తృష్టి సింగ్, రాజ్కుమా, శ్రద్ధ, రాశి(10)