కరోనా కలకలం.. 40 మంది హాస్టల్‌ విద్యార్థులకు పాజిటివ్‌.. పరీక్షలు వాయిదా

40 students test positive in Lucknow IET, exams postponed. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు కోవిడ్-19 బారిన పడ్డారు

By అంజి  Published on  13 Jan 2022 10:17 AM GMT
కరోనా కలకలం.. 40 మంది హాస్టల్‌ విద్యార్థులకు పాజిటివ్‌.. పరీక్షలు వాయిదా

లక్నో నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు కోవిడ్-19 బారిన పడ్డారు. బుధవారం మొత్తం 12 హాస్టళ్లను ఖాళీ చేయగా, పరీక్షలను వాయిదా వేశారు. దాదాపు 14 మంది విద్యార్థులు నాలుగు హాస్టళ్లలో ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 26 మంది తమ సంరక్షకులతో హోమ్ ఐసోలేషన్ కోసం వెళ్లిపోయారు. మిగిలిన 660 మంది విద్యార్థులు ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లోని 700 మంది హాస్టల్ విద్యార్థుల నమూనాలను సేకరించామని, అందులో 40 మంది పాజిటివ్‌గా ఉన్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి చెందిన సీనియర్ ఆరోగ్య అధికారి ధృవీకరించారు.

ఐఈటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వినీత్ కన్సాల్ మాట్లాడుతూ.. "మా విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించడంతో పరీక్షను తక్షణమే వాయిదా వేశారు. మేము మూడు బాలుర హాస్టళ్లలో, ఒక బాలికల హాస్టల్‌లో 14 మంది విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచాము. సంరక్షకుల అభ్యర్థనపై హోమ్ ఐసోలేషన్ కోసం పాజిటివ్ పరీక్షించిన ఇతర విద్యార్థులను వారి తల్లిదండ్రులతో వెళ్ళడానికి అనుమతించాము." కోవిడ్ పరిస్థితి మెరుగయ్యే వరకు జనవరి 11 నుంచి 24 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు.

Next Story