తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

By Medi Samrat
Published on : 5 Jun 2025 3:32 PM IST

తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మంది గాయపడ్డారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపు వారే . వీరిలో 13 ఏళ్ల లాలిక అత్యంత పిన్న వయస్కురాలు. ముగ్గురు టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మృతులను దివ్యాంశి (13), దొరేశ (32), భూమిక్ (20), సహాన (25), అక్షత (27), మనోజ్ (33), శ్రావణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20)గా గుర్తించారు.

Next Story