చార్‌ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత

ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.

By Knakam Karthik
Published on : 30 Jun 2025 4:11 PM IST

National News, Uttarakhand, Char Dham Yatra

చార్‌ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత

ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేసినట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఆదివారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ విషయాన్ని మీడియాతో తెలిపారు. "చార్‌ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం" అని ఆయన తెలిపారు. అయితే, యాత్రా మార్గంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు.

Next Story