శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం
18 killed in Muradnagar. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్నగర్లో శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం.
By Medi Samrat
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్నగర్లో ఓ శ్మశాన వాటిక ఘాట్ భవన సముదాయం పైకప్పు కుప్పకూలి 18 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
गाजियाबाद: मुरादनगर में बारिश की वजह से छत गिरी, क़रीब 10-12 लोगों के फंसे होने की आशंका है। बचाव अभियान चल रहा है। pic.twitter.com/1WUHO5MLys
— ANI_HindiNews (@AHindinews) January 3, 2021
ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి.. సమీప దవాఖానలకు తరలించారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్తోపాటు ఎస్పీని ఆదేశించారు.
UP CM Yogi Adityanath takes cognizance of roof collapse incident in Muradnagar, Ghaziabad district.
— ANI UP (@ANINewsUP) January 3, 2021
"I've instructed district officials to conduct relief operations & submit a report of incident. All possible help will be provided to those affected by the incident," he said. pic.twitter.com/3Kt6ECqIz7
మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం.