ఓ జువెల్లరీ షో రూమ్ను ప్రారంభించిన మహేష్ బాబు
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Oct 2019 3:53 PM ISTవిజయవాడ: నగరంలో సినీ హీరో మహేష్ బాబు సందడి చేశారు. ఓ ప్రముఖ బంగారు అభరణాల షాపుని ప్రారంభించిన మహేష్ బాబుని చూసేందుకు షాపు వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల తాకిడి దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు రాకకోపం బందరు రోడ్డుని షాపు నిర్వహకులు ఆక్రమించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఎంతో ఆనందంగా ఉంటుందని మహేష్ బాబు అన్నారు. నా సినిమాలకు సంబంధించి ఎక్కువ ఫంక్షన్లు విజయవాడలో నిర్వహించామన్నారు. కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి పండుగకు రిలీజ్ అవుతుందన్నారు. అభిమానులు గర్వపడేలా కొత్త సినిమా ఉంటుందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మహేష్ బాబు అన్నారు.
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/sarilelu-neekevvaru-release-update/
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/sabitha-launch-ranasthalam-firstlook/