వేసవి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ తియ్యని ఫలాలను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మామిడి పండ్లు తియ్యని రుచితో పాటు అనేక రకాల పోషకాలను మనకు అందిస్తాయి. అందుకే మామిడిని ఫలాల్లో రారాజుగా చెబుతారు. ఇందులో విటమిన్ ఏ,బీ,సీ, కె ఉంటాయి. మామిడిలో ఎక్కువ వాతం నీరు ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి పండు తినడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా ధృడంగా మారుతుంది. మామిడి పండు అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధి లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మామిడి పండులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే ఈ పండ్లను హైబీపీ ఉన్నవారు తినొచ్చు. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. వీటికి కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది. ఇందులో ఉండే పోటాషియం బీపీని నియంత్రిస్తుంది. మయోకార్డియల్ డ్యామేజ్, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.