నానబెట్టిన నట్స్తో ఆరోగ్యం పదిలం
ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.
By - అంజి |
నానబెట్టిన నట్స్తో ఆరోగ్యం పదిలం
ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా రేపటి నుంచే ప్రారంభిస్తారు.
-నానబెట్టిన గింజలను ఉదయాన్నే పరగడుపునే తినాలి. అప్పుడే అందులో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి.
-వీటిని తింటే ఎనర్జీగా పొందడమే కాకుండా.. రోజంతా యాక్టివ్గా కనిపిస్తారు.
-వీటిలో ఉన్న ఐరన్, క్యాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
-వీటిని తినడం వల్ల రెట్టింపు ఎనర్జీ రావడమే కాకుండా.. మార్మోన్లు సరిగ్గా విడుదల అవుతాయి.
-నానబెట్టిన బాదం పలుకులు ఉదయాన్నే తింటే.. బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- బరువు తగ్గేందుకు ప్రయత్నించేవాళ్లు వాల్నట్స్, పిస్తాపలుకు నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
-బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు నట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈ నట్స్ నానబెట్టుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అయితే ఇన్ని పోషకాలు ఉన్న నట్స్.. ఎక్కువగా తినడం కూడా మంచి కాదంటున్నారు న్యూట్రిషన్స్. వారానికి 10 బాదం పలుకులు, 5 వాల్నట్స్, ఒక గుప్పెడు పిస్తా పలుకులు, 5 జీడిపప్పు పలుకులను తినొచ్చని చెప్తున్నారు.