వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటాక స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కనిపించే అనేక మార్పులు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వయసు 30 ఏళ్లు దాటిన తర్వాత మనం తినే ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
30 ఏళ్లు దాటిన తర్వాత నుంచి శరీరంలో ఐరన్ శాతం తగ్గుతుంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర, బ్రకోలీ, నట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
వయస్సు పెరిగే కొద్దీ ఎముకల ధృడత్వం తగ్గుతుంది. అందుకే విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, పాలు, పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వయసుతో పాటు గుండె, మెదడుకు సంబంధించి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. వీటిని నివారించడానికి ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు తినాలి.
వయసు పెరిగేకొద్దీ కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయి. అందుకే ఎముకల సాంద్రత పెంచే కాల్షియం కోసం పాలు, వెన్న, గుడ్డు లాంటి పదార్థాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి.