Fact Check : ఆదిత్య థాక్రేతో కార్ లో ఉన్నది రియా చక్రవర్తి కాదు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 1:41 PM GMT
Fact Check : ఆదిత్య థాక్రేతో కార్ లో ఉన్నది రియా చక్రవర్తి కాదు..?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దగ్గర డబ్బులు తీసుకుందని.. రియా ఎన్నో విషయాలను దాస్తోందంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. రాజకీయ కోణంపై ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు డిబేట్ లు కూడా పెడుతున్నాయి. బాలీవుడ్ పార్టీలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు అవసరం ఏముంది అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.

ముంబై పోలీసుల ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. బీహార్ పోలీసులకు కనీసం సహకరించకుండా ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో రాజకీయాల కారణంగానే సుశాంత్ చనిపోయాడని అంటూ ఉంటే.. సుశాంత్ ను ముందుగానే చంపేశారని మరి కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. మరికొందరేమో రియా చక్రవర్తిని బలిపశువును చేశారంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఆదిత్య థాక్రే ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కూడా వచ్చారు.

మాహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ తో కార్ లో ఉన్నాడంటూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో ఆదిత్య థాక్రే కారు డ్రైవింగ్ చేస్తూ ఉండగా.. పక్కన కారులో ఓ మహిళ కూర్చుంది.

నిజ నిర్ధారణ:

ఆదిత్య థాక్రేతో పాటూ కారులో ఉన్నది రియా చక్రవర్తి కాదు.. బాలీవుడ్ నటి 'దిశా పటానీ'. వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా IndiaTv News మార్చి 11, 2019న వార్తను ప్రచురించింది. ఆదిత్య థాక్రే, దిశా పటానీ ముంబైలో లంచ్ కు వెళ్లారు. రెస్టారెంట్ బయట వీరిద్దరూ ఉన్న ఫోటోలు కూడా లభించాయి. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. Mumbai Mirror, Times of India లు కూడా ఈ వార్తను పబ్లిష్ చేశాయి.

ఆదిత్య థాక్రే మహారాష్ట్ర ఎం.ఎల్.ఏ మాత్రమే కాదు.. క్యాబినెట్ మినిస్టర్ కూడా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు.

కారులో ఆదిత్య థాక్రే పక్కన ఉన్నది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కాదు. తెలుగులో లోఫర్ సినిమా, బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులలో నటించిన దిశా పటానీ.

Next Story