బిగ్బ్రేకింగ్ : ఎంఎంటీఎస్ రైళ్లు ఢీ.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
By Medi Samrat Published on 11 Nov 2019 6:33 AM GMTముఖ్యాంశాలు
- ఆగి ఉన్న ట్రైన్ను డీకొన్న మరో ట్రైన్
- తృటిలో తప్పిన భారీ ప్రమాదం
కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్ ను వెనుకనుండి మరో ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న జీఆర్పీ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టెక్నికల్ లోపం వల్లే ఆగివున్న ట్రైన్ ను.. వెనుకనుండి మరో ఎంఎంటిఎస్ ట్రైన్ డీ కొట్టిందని తెలిపారు. తృటిలో పెను ప్రమాదం నుండి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలవగా.. గాయపడిన వారిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story