జన్‌ధన్‌ ఖాతాదారులకు శుభవార్త

By సుభాష్  Published on  2 April 2020 3:42 AM GMT
జన్‌ధన్‌ ఖాతాదారులకు శుభవార్త

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించడంతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు జనాలు ఎవ్వరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సామాన్యులకు ఉపాధి లేకపోవడంతో ఆందోళనలో పడిపోయారు. దీంతో మోదీ సర్కార్‌ మహిళలకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. 'పీఎం గరీబ్‌ కల్యాణ్‌' ప్యాకేజీ కింద ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలున్న మహిళలందరికీ ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ. 500నగదును జమ చేయనుంది. ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయా అకౌంట్లలో ఈ డబ్బులు జమ కానున్నాయి.

ఈ డబ్బులు అకౌంట్లో వచ్చిన తర్వాత ఎప్పుడైన డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు మహిళల ఖాతాలకు కేవైసీ పత్రాలు లేవనే కారణంతో ఖాతాను స్థంభింపజేయవద్దని, అలాంటి ఖాతాలు ఏమైనా ఉంటే వెంటనే యాక్టివేట్‌ చేయాలని సూచించింది మోదీ సర్కార్‌. ఇక జన్‌ధన్‌ ఖాతాలున్న మహిళలు ఓసారి ఖాతాలను చెక్‌ చేసుకోండి.

Next Story