జమ్మూఫూంచ్ హైవేపై ఐఈడీ కలకలం..!
By న్యూస్మీటర్ తెలుగుPublished on : 19 Nov 2019 11:44 AM IST

కశ్మీర్ : భారత్ లో ఉగ్రవాదులు తీవ్ర ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లుంది. ఇప్పటికే 75 మంది ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారనే సమాచారంతో నిఘా సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే..జమ్ముపూంచ్ హైవేపై కిలోల కొద్దీ ఐఈడీని భద్రతా బలగాలు కనుగొన్నాయి. స్పాట్కు బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. ఎటువంటి ప్రమాదం లేకుండా ఐఈడీని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం జమ్ము,పూంచ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. రహదారిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story