ఆమెను కంట్రోల్ చేయండి.. ప్రధాని మోదీని కోరిన యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢాకా చేసిన అభ్యర్థనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు

By Medi Samrat
Published on : 12 Jun 2025 8:42 AM

ఆమెను కంట్రోల్ చేయండి.. ప్రధాని మోదీని కోరిన యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢాకా చేసిన అభ్యర్థనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్‌లో ఉండి షేక్ హసీనా చేస్తున్న వ్యాఖ్యలు బంగ్లాదేశ్ అంతటా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయని యూనస్ అన్నారు.

లండన్‌లోని చాథమ్ హౌస్‌లో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా యూనస్.. ప్రధాని మోదీతో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. "ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, మీరు షేక్ హసీనాకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారని, ఆ విధానాన్ని వదులుకోవాలని మిమ్మల్ని బలవంతం చేయలేను" అని చెప్పానన్నారు. కానీ ఆమె వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినట్లుగా యూనస్ ప్రధాని మోదీతో అన్నారు.

హసీనా మరిన్ని ప్రకటనలు చేయకుండా నిరోధించాలని తాను ప్రధాని మోదీని కోరానని యూనస్ అన్నారు. దీనికి భారత ప్రధాని "ఇది సోషల్ మీడియా, మీరు దానిని నియంత్రించలేరు" అని బదులిచ్చారని యూనస్ తెలిపారు. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత ప్రభుత్వానికి లేఖ రాసిందని, చట్టపరమైన చర్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఆయన ధృవీకరించారు.

Next Story