'ట్రంప్ వాదన అవాస్తవం'.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదిక‌లు వెల్ల‌డించాయి.

By Medi Samrat
Published on : 25 Jun 2025 8:28 AM IST

ట్రంప్ వాదన అవాస్తవం.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదిక‌లు వెల్ల‌డించాయి. అయితే రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ విసిరిన బాంబులు ఇరాన్ అణు స్థావరాలకు ఎటువంటి హాని చేయలేకపోయాయని తెలుస్తుంది. రాయిటర్స్ ప్రకారం.. ఈ దాడిలో ఇరాన్ సుసంపన్నమైన యురేనియం నిల్వలు క్షీణించలేదని.. వాస్తవానికి ఈ దాడి ఇరాన్ అణు కార్యక‌లాపాల‌ను కేవలం ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే వెనక్కి నెట్టగలదని అక్క‌డి మూలాలు తెలిపిన‌ట్లు నివేదించింది.

టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడంలో అమెరికా దాడులు విజయవంతమయ్యాయన్న ట్రంప్ వాదనకు ఈ అంచనా విరుద్ధంగా ఉంది. ప్రోగ్రామ్ నిజంగా తీవ్రమైన వైమానిక బాంబు దాడి నుండి బయటపడినట్లయితే.. అవి US సైనిక చర్యల‌పై ప్రశ్నలను లేవనెత్తుతుంది.

అయితే.. ఇంటెలిజెన్స్ నివేదిక పూర్తిగా అబద్ధమని వైట్ హౌస్ పేర్కొంది. అక్క‌డి సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ గతంలో చెప్పినప్పటికీ.. ఇరాన్ అణు కేంద్రాలపై వారాంతపు దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాయని ట్రంప్ పరిపాలన విభాగం మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపింది. ఇరాన్‌పై అమెరికా దాడికి సంబంధించిన వివరాలను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా అమెరికా కాంగ్రెస్ సభ్యులకు అందించనున్నారు.

ఇఇలావుంటే.. ఇజ్రాయెల్, ఇరాన్ తమ వివాదానికి "అధికారిక ముగింపు" కు అంగీకరించినట్లు ట్రంప్ ఇంటర్నెట్ మీడియాలో ప్రకటించారు. అయితే.. ఇరాన్ తన గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించడంతో మ‌ళ్లీ ఘ‌ర్షణ వాతావ‌ర‌ణం ఏర్పడింది.

Next Story