బంగ్లాదేశ్లోని సిరాజ్గంజ్ జిల్లాలో ఉన్న నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై ఒక గుంపు దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఆడిటోరియం, వారసత్వ ప్రదేశంలోని ఇతర భాగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్ను ధ్వంసం అయ్యాయి. మోటార్ సైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఒక సందర్శకుడికి, సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం ఈ విధ్వంసానికి కారణమైందని మీడియా నివేదికలు తెలిపాయి. భవనంపై జరిగిన మూక దాడిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామి, హెఫాజత్-ఇ-ఇస్లాం బంగ్లాదేశ్ అనే రాడికల్ గ్రూపులు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన దాడులని బీజేపీ ఎంపి సంబిత్ పాత్ర ఆరోపించారు.
చారిత్రాత్మక స్థలంపై జరిగిన మూక దాడికి సంబంధించి 50–60 మందిపై కేసు నమోదు చేసినట్లు ఢాకాకు చెందిన డైలీ స్టార్ నివేదించింది. రవీంద్ర కచారిబారి అంటే "టాగోర్ ఎస్టేట్ ఆఫీస్ హోమ్" అని అర్థం, రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబం ఈ ఎస్టేట్ను పర్యవేక్షించింది. ఇప్పుడు ఈ భవనం స్మారక మ్యూజియంగా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి కొనుగోలు చేసిన ఈ భవనంలో చాలా నాటకాలని రాశారు.