పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన 1960 ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సింధూ నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. పాకిస్థాన్తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాదం నిర్మూలన, పీవోకేకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.