పాకిస్థాన్‌లో కేకలు మొదలయ్యాయి

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నదీ వ్యవస్థతో ఆధారపడి ఉంది.

By Medi Samrat
Published on : 2 Jun 2025 5:07 PM IST

పాకిస్థాన్‌లో కేకలు మొదలయ్యాయి

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నదీ వ్యవస్థతో ఆధారపడి ఉంది. అయితే తీవ్రమైన నీటి కొరత కారణంగా ఖరీఫ్ (వేసవి పంటలు) సీజన్ కఠినంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సింధు నదిపై తర్బెలా, జీలం నదిపై మంగ్లాలో నీరు తగ్గిపోతోందని నిపుణులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాల కారణంగా చీనాబ్ నదిలోకి నీటి ప్రవాహం ఆకస్మికంగా తగ్గిందని తెలుస్తోంది.

పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జూన్ 02, 2024తో పోలిస్తే, జూన్ 02, 2025 నాటికి సింధు నదీ వ్యవస్థలో (పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లోపల) నీటి లభ్యత 10.3 శాతం తగ్గింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి ఇంకా కనీసం నాలుగు వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చు.

ఇస్లామాబాద్‌లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం నీటి లభ్యత జూన్ 2, 2025 నాటికి కేవలం 1,28,800 క్యూసెక్కులు మాత్రమే, ఇది గత సంవత్సరం ఇదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ అని తేలింది. నైరుతి రుతుపవనాలు జూన్ చివరి వరకు పంజాబ్ ప్రావిన్స్‌కు చేరుకునే అవకాశం లేనందున ఈ నీటి కొరత అక్కడి రైతులకు విపత్తుగా మారవచ్చు.

Next Story