పర్యాటకులు చనిపోవడంపై ఆందోళన చెందుతున్నాం..పహల్గామ్‌ అటాక్‌పై పాక్ స్పందన

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ స్పందించింది.

By Knakam Karthik
Published on : 23 April 2025 1:35 PM IST

International News, Pakistan, Pahalgam attack

పర్యాటకులు చనిపోవడంపై ఆందోళన చెందుతున్నాం..పహల్గామ్‌ అటాక్‌పై పాక్ స్పందన

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ స్పందించింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. మృతుల బంధువులకు మా సంతాపం తెలియజేస్తున్నాము.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ప్రతినిధి తెలిపారు.

కాగా మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో 3–4 మంది ఉగ్రవాదులు కనీసం 26 మందిని కాల్చి చంపారు. సందర్శకులతో రద్దీగా ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ప్రాథమిక నిఘా నివేదికల ప్రకారం, నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని, అయితే అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండాల్సి ఉందని తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌లో రక్తపాతం జరిగిన నేపథ్యంలో, కేంద్రపాలిత ప్రాంతం అంతటా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. అన్ని దుర్బల ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు మరియు లోయ అంతటా అదనపు దళాలను మోహరించారు. బారాముల్లా జిల్లాలోని ఉరి నాలా సమీపంలోని సర్జీవన్ వంటి సున్నితమైన ప్రాంతాలుగా పరిగణించబడే ప్రాంతాలలో, చెక్‌పోస్టులను ముళ్ల తీగల బారికేడ్లతో బలోపేతం చేశారు. వాహన తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.

Next Story