పాకిస్థాన్ సోమవారం నాడు మరో క్షిపణిని ప్రయోగించింది. పాకిస్థాన్ ఆర్మీ సైనిక విన్యాసాలలో భాగంగా ఎక్సర్సైజ్ ఇండస్ లో 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఫతాహ్ క్షిపణిని ప్రయోగించింది. ఉపరితలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) బాధ్యత వహించిన తరువాత భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
ఈ క్షిపణి పరీక్ష క్షిపణి విజయవంతమైందని, అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన ఖచ్చితత్వంతో పని చేసిందని పాకిస్థాన్ తెలిపింది. కేవలం తమ దళాల సంసిద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని సమీక్షించుకునేందుకే ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు మాత్రమే పాకిస్థాన్ మిలిటరీ స్పష్టం చేసింది. శనివారం నాడు కూడా పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు జరిపింది. 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణిని పాకిస్థాన్ ప్రయోగించింది.