భారతీయులపై నిషేధం అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన‌ సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి భారతీయుల వీసాలపై నిషేధం ఉందన్న వార్తలను సౌదీ అరేబియా పూర్తిగా ఖండించింది.

By Medi Samrat
Published on : 9 Jun 2025 3:38 PM IST

భారతీయులపై నిషేధం అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన‌ సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి భారతీయుల వీసాలపై నిషేధం ఉందన్న వార్తలను సౌదీ అరేబియా పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని సౌదీ ప్రభుత్వం చెబుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా తప్పు అని పేర్కొంది. హజ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా భారత్‌తో సహా 14 దేశాల వర్క్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అనేక మీడియా నివేదికలు వెల్ల‌డించాయి. అయితే సౌదీ ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను పుకార్లుగా పేర్కొంది.

భారతీయ వీసాలపై సౌదీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదని వార్తా సంస్థ ఏఎన్‌ఐ వర్గాలు తెలిపాయి. ANI ప్రకారం.. సౌదీ అరేబియా భారతీయుల వీసాలను రద్దు చేస్తుందన్న వార్తలు తప్పు. దీనికి సంబంధించి సౌదీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. హజ్ యాత్రలో రద్దీని నివారించేందుకు స్వల్పకాలిక వీసాలపై కొన్ని పరిమితులు విధించినప్పటికీ.. హజ్ యాత్ర ముగిసిన తర్వాత వీటిని కూడా తొలగిస్తారని పేర్కొంది.

సౌదీ అరేబియా హజ్ తీర్థయాత్ర కింద జూన్ 30 వరకు 14 దేశాల వర్క్ వీసాలను రద్దు చేసిందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ 14 దేశాల జాబితాలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, యెమెన్, మొరాకో, నైజీరియా, ఇథియోపియా, సూడాన్, ట్యునీషియా పేర్లు ఉన్నాయి.

Next Story