భారత్-పాక్ ఒకే సారి స్వాతంత్ర్యం పొందినా.. ఇస్లామాబాద్ టిష్యూ పేపర్‌ అయింది : ఇమ్రాన్ ఖాన్

Nawaz Sharif's daughter tells Imran Khan after he praises neighbour. భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు ప్రశంసలు గుప్పించారు.

By Medi Samrat  Published on  9 April 2022 10:06 AM GMT
భారత్-పాక్ ఒకే సారి స్వాతంత్ర్యం పొందినా.. ఇస్లామాబాద్ టిష్యూ పేపర్‌ అయింది : ఇమ్రాన్ ఖాన్

భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు ప్రశంసలు గుప్పించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ కు ఇటీవలి కాలంలో ఏమీ కలిసి రాకపోవడంతో జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఏ సూపర్ పవర్ కూడా భారత్‌ను శాసించలేదని.. ఆరెస్సెస్ భావజాలమే అందుకు కారణమని అన్నారు. భారత్‌ను, పాకిస్థాన్‌ను వేరు చేసింది కూడా అదేనని అన్నారు. భారత్ గురించి ఇతరుల కంటే తనకే ఎక్కువ తెలుసని ఇమ్రాన్ అన్నారు. పాకిస్థాన్‌కు కూడా స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని అన్నారు. భారత్‌ను చూసి స్వాభిమానాన్ని నేర్చుకోవాలన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరిగిందన్నారు. పాకిస్థాన్‌లో నామమాత్రపు వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పతనాన్ని సంబరాలు చేసుకుంటోందంటూ పాక్ మీడియాపైనా ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని తాను ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించననీ, ప్రజలందరూ ఆదివారం వీధుల్లోకి వచ్చి ఇందుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కోరారు.

వ్యాఖ్య‌ల‌పై పాక్‌ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కుమార్తె మ‌రియం న‌వాజ్ ష‌రీఫ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌డం కరెక్ట్ కాదని ఆమె ఆరోపించారు. భార‌త్‌ ఆత్మాభిమానాన్ని ప్రశంసిస్తూ ఇమ్రాన్ ఖాన్ పాక్‌పై చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని అన్నారు. భార‌త్‌ను కొనియాడుతున్న‌ ఇమ్రాన్ ఖాన్‌ పాక్ ను వ‌దిలి భారత్ కు వెళ్లాల‌ని ఆమె అన్నారు. అధికారం కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్‌ను సొంత పీటీఐ పార్టీ నేత‌లు కూడా బ‌హిష్క‌రిస్తున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని 'ఖుద్దర్ క్వామ్' అని ప్రశంసించిన తరువాత ఇమ్రాన్ ఖాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎమ్‌ఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ అయిన మ‌రియం, పాకిస్తాన్ ప్రధానికి "అంతగా నచ్చితే" దేశం విడిచిపెట్టి భారతదేశానికి వెళ్లమని చెప్పారు.

"ఈ అధికారం పోయిందని చూసి వెర్రితలలు వేస్తున్న వ్యక్తికి ఒక విషయం చెప్పాలి, తనను తన సొంత పార్టీయే తరిమికొట్టింది.. మరెవరో కాదు. మీకు భారత్ అంటే అంత ఇష్టమైతే అక్కడికి వెళ్లి పాకిస్థాన్‌ను పెట్టండి" అని మరియం ఖాన్ అన్నారు. పాక్ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానానికి ముందు ఆమె మాట్లాడుతూ.. 'అధికారం కోసం ఎవరైనా ఇలా ఏడ్వడం నేను చూడటం ఇదే తొలిసారి.' అని అన్నారు.

ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానానికి ముందు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఏ సూపర్ పవర్ కూడా భారతదేశానికి నిబంధనలను నిర్దేశించదని చెప్పాడు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ రెండూ మంచి సంబంధాలను పంచుకోలేదని అంగీకరించారు. "భారతీయులు ఖుద్దర్ క్వామ్ (చాలా ఆత్మగౌరవ ప్రజలు).. ఆ దేశానికి నిబంధనలను ఏ అగ్రరాజ్యం నిర్దేశించదు," అని ఆయన శుక్రవారం అన్నారు. భారతదేశం, పాకిస్థాన్ రెండూ కలిసి స్వాతంత్ర్యం పొందాయని, అయితే ఇస్లామాబాద్ టిష్యూ పేపర్‌గా ఉపయోగించబడుతోందని, విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ అయిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.















Next Story