నేపాల్ త‌ర‌హా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు

నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్‌లో Gen-Z త‌ర‌హాలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు.

By -  Medi Samrat
Published on : 14 Oct 2025 10:48 AM IST

నేపాల్ త‌ర‌హా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు

నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్‌లో Gen-Z త‌ర‌హాలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. నీటి కొరతపై దేశ‌ పౌరుల‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆపై దేశాధ్య‌క్షుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మడగాస్కర్‌ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోయారు.

మడగాస్కర్‌లోని ప్రతిపక్ష నాయకుడు, సైన్యం, విదేశీ దౌత్యవేత్తలు కూడా ఈ వార్తను ధృవీకరించారు. నేపాల్ తర్వాత Gen-Z అధికార మార్పిడిలో విజయం సాధించడం ఇది రెండోసారి. మడగాస్కర్ ప్రతిపక్ష నాయకుడు సితేని మాట్లాడుతూ.. ఒక సైన్యం యూనిట్ కూడా ఆదివారం నాడు Gen-Z నిరసనకారులతో చేరిందని, అధ్యక్షుడు ఆండ్రెస్‌ను దేశం విడిచి వెళ్ళమని ప్రేరేపించాడు.

సీతేని ప్రకారం.. రాష్ట్రపతి నిష్క్రమణ గురించి సమాచారం అందుకున్న తరువాత, మేము రాష్ట్రపతి భవన్ సిబ్బందికి ఫోన్ చేసాము. ఆండ్రీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి పారిపోయాడని అతను ధృవీకరించాడు. అయితే దీనిపై రాష్ట్రపతి భవన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆండ్రీ సోమవారం అర్థరాత్రి ఫేస్‌బుక్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన భార్య ప్రాణాలను కాపాడేందుకు సురక్షిత ప్రాంతానికి వెళ్లానని చెప్పాడు. అయితే, వారు ఎక్కడ ఉన్నారు? అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. మడగాస్కర్‌ను నాశనం చేయనివ్వనని చెప్పారు.

ప్రెసిడెంట్ ఆండ్రెస్ ఫ్రెంచ్ మిలిటరీ విమానంలో దేశం విడిచి పారిపోయాడని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. మడగాస్కర్ గతంలో ఫ్రాన్స్ కాలనీగా ఉండేది. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాత్రం దీనిపై తనకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

నేపాల్, కెన్యాలో Gen-Z ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 25న మడగాస్కర్ యువత కూడా నీరు, విద్యుత్ కొరతను పేర్కొంటూ ప్రభుత్వంపై దాడి చేశారు. సైన్యం కూడా నిరసనకారులకు మద్దతు ఇచ్చింది. ఇది అధ్యక్షుడు ఆండ్రీ సమస్యలను పెంచింది. ఆండ్రీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Next Story