ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 950 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat
Published on : 23 Jun 2025 9:41 AM IST

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 950 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివ‌ర‌కూ 950 మంది ఇరానియన్లు మరణించగా.. 3,450 మందికి పైగా గాయపడ్డారు. వాషింగ్టన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు ఇరాన్‌లో చనిపోయిన వారి గణాంకాలను వెల్ల‌డించారు. ఇరాన్‌పై దాడిలో 380 మందికి పైగా పౌరులు.. 253 మంది సైనిక సిబ్బంది మరణించారు.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తత నేప‌థ్యంలో.. ఇరాన్ ప్రతిరోజూ చనిపోయిన వారి గణాంకాలను వెల్ల‌డించ‌డం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 400 మంది ఇరానియన్లు మరణించారని, 3,056 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

అయితే, శనివారం రాత్రి అమెరికా కూడా ఇరాన్‌లోని కొన్ని చోట్ల బాంబులు వేసింది. వీటిలో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అణు స్థావరాల పేర్లు ఉన్నాయి. అమెరికా దాడి తర్వాత.. ఈ దాడిలో మనం చాలా నష్టపోయామని, అయితే మన అణ్వాయుధాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఆడుల‌లో మృతుల సంఖ్యను ఇరాన్ వెల్లడించలేదు.

జూన్ 13న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత.. ఇజ్రాయెల్ జూన్ 21న చనిపోయిన వారి గణాంకాలను ప్ర‌క‌టించింది. ఇజ్రాయెల్ ప్రకారం.. ఇరాన్ దాడిలో 24 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు.

Next Story