ఆ దేశంలో ఎర్ర జెండాలు ఎగురవేశారు.. తర్వాత జరగబోయేది ఇదే.!

ఇరాన్ భూభాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది.

By Medi Samrat
Published on : 13 Jun 2025 4:49 PM IST

ఆ దేశంలో ఎర్ర జెండాలు ఎగురవేశారు.. తర్వాత జరగబోయేది ఇదే.!

ఇరాన్ భూభాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరువాత ప్రతీకార చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు సూచిస్తూ ఇరాన్ లోని మసీదులపై ఎర్ర రంగు జెండాలను ఎగురవేశారు. శుక్రవారం నాడు కోమ్‌లోని జాంకరన్ మసీదు పైన ఇరాన్ ప్రతీకార చిహ్నంగా ఎర్ర జెండాను ఎగురవేసింది.

X లో ప్రచురించిన ఒక వీడియో జెండాను ఎగురవేసిన క్షణం చూపించింది. ఇరానియన్ సంప్రదాయంలో, ఎర్ర జెండా న్యాయం, ప్రతీకారం కోసం పిలుపును సూచిస్తుంది. వందలాది మంది నిరసనకారులు మసీదు వద్ద గుమిగూడి, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Next Story