ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్న వ్య‌క్తిని ఉరితీసిన‌ ఇరాన్

ఇజ్రాయెల్ నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేసినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసిందని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయవ్యవస్థ నివేదించింది.

By Medi Samrat
Published on : 23 Jun 2025 5:24 PM IST

ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్న వ్య‌క్తిని ఉరితీసిన‌ ఇరాన్

ఇజ్రాయెల్ నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేసినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసిందని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయవ్యవస్థ నివేదించింది. ఇజ్రాయెల్ కు నిఘా సహకారం అందించిన మొహమ్మద్ అమీన్ మహదవి షాయెస్తేను ఈ ఉదయం ఉరితీశారని ఇరాన్ న్యాయవ్యవస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ షాయెస్తేను 2023లో అరెస్టు చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ మరణ శిక్ష విధించడం జరిగింది. అంతకుముందు కూడా, జూన్ 14న ఇరాన్ అధికారులు మొసాద్ తరపున గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉరితీశారు. పూర్తి నేర విచారణ తర్వాత ఇజ్రాయెల్ మొసాద్ గూఢచారిని ఉరితీశారు, తీర్పును ఇరాన్ సుప్రీంకోర్టు సమర్థించిందని ఇరాన్ మెహర్ వార్తా సంస్థ నివేదించింది.

Next Story