కెనడాలోని మానిటోబాలో విమానాలు గాల్లోనే ఢీకొన్న ప్రమాదంలో మరణించిన ఇద్దరు పైలట్లలో 23 ఏళ్ల భారతీయుడు కూడా ఉన్నాడని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు. రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీకొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీహరి సుకేశ్ కేరళకు చెందినవాడు. సుకేశ్ కొచ్చిలోని త్రిప్పునితురలోని స్టాట్యూ న్యూ రోడ్ నివాసి.
కెనడాకు చెందిన సవన్నా మే రాయ్స్ (20) అనే మరో యువ పైలట్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. శ్రీహరి, సవన్నా ఇద్దరూ మానిటోబాలోని హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. స్టెయిన్బాచ్ పట్టణం వద్ద శిక్షణలో భాగంగా చిన్న విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే రన్వేపై ఒకేసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో సుమారు 400 మీటర్ల ఎత్తులో వారి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.